Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో టోర్నడోలా.. ములుగులో రెండు గంటల పాటు..?

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (18:33 IST)
ఇటీవలి రోజులలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక  ప్రాంతాలలో తీవ్ర వరదలు సంభవించాయి.  ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో సుడిగాలి తుఫాను కారణంగా 1 లక్షకు పైగా చెట్లు నేలకూలాయి. ఆగస్ట్ 31న ఈ ఘటన జరిగినా చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆగస్టు 31న సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సంబంధిత ప్రాంతంలో భారీ గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
 
దీంతో ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తాడ్వాయి మండలం గోనెపల్లి గ్రామం వరకు 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలను పంపాలని, ఈ ప్రాంతంలో చెట్లను పునరుద్ధరించడానికి అవసరమైన నిధులు కేటాయించాలని కేబినెట్ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments