Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (09:35 IST)
తెలంగాణాలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురింసింది. ఇక రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీచేసింది. 
 
కాగా, గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీమ్, అసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. 
 
శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, జనగాం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments