Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:29 IST)
కుప్పలుతెప్పలుగా కోళ్లు గిరాగిరా తిరిగి చనిపోతున్నాయి. కోళ్లఫార్ముల్లో కోళ్లు ఊడ్చుకుపోతున్నాయి. కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన కోళ్లు వల్ల భారీగా నష్టం వాటిల్లుతుంటే బతికి వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసే దిక్కు లేక అవస్తలు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో వున్నటువంటి కోళ్లఫాంలో మొత్తం 13 వేల కోళ్లకు గాను 7000 బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి.
 
ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వాటన్నిటినీ పెద్దగొయ్యి తీసి అందులో వేసేశాడు రైతు. కాగా వున్న కోళ్లను కొనే దిక్కు లేదంటూ వాపోతున్నాడు. కోళ్ల మృతితో తనకు 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందనీ, ప్రస్తుతం తన వద్ద వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని రైతు వాపోతున్నాడు. మరోవైపు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోడి మాంసం అమ్ముతున్నవారు ఎవరైనా వుంటే తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపులపై తనిఖీలు చేస్తామన పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments