వినాయక చతుర్థి స్పెషల్- పాలతాలికలు ఎలా చేయాలంటే?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (18:20 IST)
వినాయక చతుర్థి రోజున ఉండ్రాళ్ళు, పాలతాలికలు, పండ్లు వంటివి గణేశునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి నైవేద్యాల్లో ఒకటైన పాలతాలికలను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
‌పాలు -  ఒకటిన్నర లీటరు. 
నీళ్లు - ఒక లీటరు. 
పంచదార - పావు కేజీ
‌బెల్లం - పావుకేజి. 
యాలకుల పొడి - ఒక టీ స్పూను. 
నెయ్యి - కొద్దిగా. 
‌సగ్గు బియ్యం - ‌వందగ్రాములు. 
బియ్యపిండి - వందగ్రాములు. 
మైదాపిండి - రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం: 
ముందుగా పాలను నీటిని మరిగించాలి. అందులో సగ్గుబియ్యాని కూడా ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదారతో పిండిలా కలుపుకోవాలి. పిండిని తాలికల్లా చేసుకుని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ఈ జంతికలు అతుక్కోకుండా కలుపుతూ వుండాలి. తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, యాలకుల పొడిని వేసి కలపాలి. అంతే పాల తాలికలు సిద్ధమైనట్లే. ఈ వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి

ఆస్తి కోసం మత్తు బిళ్ళలు కలిపిన బిర్యానీ భర్తకు వడ్డించి హత్య

అక్రమం సంబంధం ... వివాహితను హత్య చేసిన వ్యక్తి

అండర్-15 యువతకు సోషల్ మీడియో వినియోగంపై నిషేధం.. ఎక్కడ?

ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 20మంది సేఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments