కరోనావైరస్ భయం, ఇంట్లోనే ఈ లడ్డూలు చేసిపెట్టండి

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (21:27 IST)
ఇప్పుడు కరోనావైరస్ నేపధ్యంలో స్వీట్ షాపుల్లో ఏవైనా కొనాలంటే భయం పట్టుకుంటోంది. ఇంకోవైపు పిల్లలు చిరుతిళ్ల కోసం గోల చేస్తుంటారు. పిల్లలకి హాయిగా ఇంట్లోనే రవ్వలడ్డులు చేసిపెడితే చక్కగా తినేస్తారు. వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
తురిమిన పచ్చికొబ్బరి- రెండు కప్పులు
పంచదార- ఒకటిన్నర కప్పు
నెయ్యి- అర కప్పు
జీడిపప్పు- రెండు టీస్పూన్‌లు
కిస్ మిస్- రెండు టీస్పూన్‌లు
యాలకుల పొడి- పావు టీస్పూన్
 
తయారీ విధానం :
మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. పంచదార కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి.
 
ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే, కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీ ట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలకు గుడ్ బై?

Rain forecast: అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన ఏడుగురు.. క్రాకర్స్ వల్లే?

శీతాకాలానికి బైబై.. తెలంగాణలో పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బాబుతో భేటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డానీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది

Shivani Nagaram: కథలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను : శివానీ నగరం

2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల వసూళ్లు దక్కించుకున్న కపుల్ ఫ్రెండ్లీ

Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి

Mani Ratnam: తు యా మైన్ చిత్రంపై మణిరత్నం ప్రశంసల జల్లు

తర్వాతి కథనం
Show comments