కరోనావైరస్ భయం, ఇంట్లోనే ఈ లడ్డూలు చేసిపెట్టండి

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (21:27 IST)
ఇప్పుడు కరోనావైరస్ నేపధ్యంలో స్వీట్ షాపుల్లో ఏవైనా కొనాలంటే భయం పట్టుకుంటోంది. ఇంకోవైపు పిల్లలు చిరుతిళ్ల కోసం గోల చేస్తుంటారు. పిల్లలకి హాయిగా ఇంట్లోనే రవ్వలడ్డులు చేసిపెడితే చక్కగా తినేస్తారు. వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
తురిమిన పచ్చికొబ్బరి- రెండు కప్పులు
పంచదార- ఒకటిన్నర కప్పు
నెయ్యి- అర కప్పు
జీడిపప్పు- రెండు టీస్పూన్‌లు
కిస్ మిస్- రెండు టీస్పూన్‌లు
యాలకుల పొడి- పావు టీస్పూన్
 
తయారీ విధానం :
మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. పంచదార కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి.
 
ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే, కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments