Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్.. గైస్... మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా వుంది.. ఆటగాళ్లతో ఫీల్డ్ అంపైర్ (Video)

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (20:48 IST)
జోహాన్నెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజైన గురువారం వరుణ దేవుడు తీవ్ర అటంకం కలిగించారు. ఫలితంగా ఒక్క బంతి కూడా పడలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైరింగ్ విధులు నిర్వహించే సౌతాఫ్రికా జాతీయుడు మరాయిస్ ఎరాస్మస్ ఓ దశలో భారత ఆటగాళ్ల అరుపులకు బెంబేలెత్తిపోయారు. 
 
బంతి ప్యాడ్లకు తగిలితే చాలు.. బౌలర్, వికెట్ కీపర్ సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్క భారత క్రికెటర్ బిగ్గరగా అరుస్తూ అప్పీల్ చేయడం పట్ల ఆయన స్పందించారు. ప్రధానంగా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు తరచుగా అప్పీల్ చేయడం అంపైర్ మారాయిస్ ఎరాస్మస్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది. దీంతో ఆయన భారత ఆటగాళ్లను ఉద్దేశించి.. "మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా వుంది" అని మెల్లగా అన్నారు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీనికి సబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పీటలపై వరుడు చెంప పగులగొట్టిన వధువు.. ఎక్కడ?

ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి

వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!! (Video)

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఖరారు చేసిన కేజ్రీవాల్!

రీల్స్ పిచ్చి.. అచ్చం శవంలా పడుకున్నాడు.. చిప్పకూడు తప్పలేదు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

అమెరికా న్యూ ఇంగ్లాండ్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్

జానీ మాస్టర్ కు నాగబాబు వార్నింగ్, డాన్సర్ అసోసియేషన్ నుంచి జానీ అవుట్

కష్టానికి తగ్గ పారితోషికం తీసుకున్నా - భయమే దేవర కథకు మూలం: ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments