Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తికరంగా రెండో టెస్ట్ : నాలుగో రోజు ఆటకు వరుణుడు అంతరాయం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:30 IST)
జోహెన్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో గురువారం ఇంకా ఆట మొదలుకాలేదు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ముంగిట 240 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా జట్టు నిర్ధేశించిన విషయం తెల్సిందే. 
 
ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 122 పరుగులు చేయాల్సివుండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. 
 
క్రీజ్‌లో కెప్టెన్ డీన్ ఎల్గార్ 46, రాస్సీ వాన్ డర్ డుస్సెన్‌లు 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొడితే మాత్రం మ్యాచ్‌పై పట్టుసాధించినట్టే. 
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments