ఆసక్తికరంగా రెండో టెస్ట్ : నాలుగో రోజు ఆటకు వరుణుడు అంతరాయం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:30 IST)
జోహెన్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో గురువారం ఇంకా ఆట మొదలుకాలేదు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ముంగిట 240 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా జట్టు నిర్ధేశించిన విషయం తెల్సిందే. 
 
ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 122 పరుగులు చేయాల్సివుండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. 
 
క్రీజ్‌లో కెప్టెన్ డీన్ ఎల్గార్ 46, రాస్సీ వాన్ డర్ డుస్సెన్‌లు 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొడితే మాత్రం మ్యాచ్‌పై పట్టుసాధించినట్టే. 
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments