Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం.. స్టిక్‌తో దాడి చేస్తూ కనిపించిన రెజ్లర్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (11:00 IST)
ఛత్రసాల్‌ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్‌ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్‌ వర్గాలకు పంపించాలనుకున్నాడు. 
 
కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి.. సుశీల్‌ను అరెస్ట్ చేశారు. అతనిని పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. సుశీల్‌కు ముందస్తు బెయిల్‌‌ను తిరస్కరించారు. 
 
ప్రస్తుతం కోర్టు రిమాండ్‌లో వున్న సుశీల్ దర్యాప్తునకు సహకరించట్లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో యువ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్‌ మీడియాలో ప్రసారం అవుతోంది. 
 
ఛత్రసాల్‌ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్‌ బేస్‌బాల్‌ స్టిక్‌/కర్రను చేతిలో పట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments