ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్లో చాంపియన్స్ హాకీ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం గురువారం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్కు తిరిగి చోటు కల్పించారు. మిడ్ ఫీల్డ్ను బలోపేత
ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్లో చాంపియన్స్ హాకీ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం గురువారం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్కు తిరిగి చోటు కల్పించారు. మిడ్ ఫీల్డ్ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్రాలను ఎంపిక చేశారు.
మొత్తం 18 మంది సభ్యుల జట్టుకు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ యేడాది గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యంగా, కామన్వెల్త్ జట్టులో చోటుదక్కని సర్దార్ సింగ్, లక్రాలను తిరిగి ఎంపిక చేయడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో భాగంగా, ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడుతుంది.