Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం.. ఎపుడు?

క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2019లో జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుండగా, 2023లో జరిగే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం.. ఎపుడు?
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:26 IST)
క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2019లో జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుండగా, 2023లో జరిగే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ దఫా భారత్ ఒక్కటే మెగా ఈవెంట్‌ను నిర్వహించనుంది. 
 
వాస్తవానికి భారత్‌ గతంలో 1987, 1996, 2011 ప్రపంచకప్‌లకు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చింది. 2021 ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా భారత్‌లోనే జరగనుంది. భారత జట్టు 2019 నుంచి 2023 వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 81 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. గత భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో కంటే ఇవి 31 మ్యాచ్‌లు ఎక్కువ. సోమవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 
 
ఇకపోతే, ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న పసికూన అప్ఘనిస్థాన్‌కు భారత్‌ సాదర స్వాగతం పలికింది. ఆ దేశ అరంగేట్ర టెస్టుకు ఆతిథ్యమివ్వాలని నిర్ణయించింది. తీవ్రవాదంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నా అఫ్గాన్‌ గత కొన్నేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదిగింది.

ఐర్లాండ్‌తో పాటు జూన్‌లో టెస్టు హోదాను దక్కించుకుంది. నిజానికి అఫ్గానిస్థాన్‌ తన తొలి టెస్టును 2019లో ఆస్ట్రేలియాతో ఆడాల్సివుంది. కానీ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాల రీత్యా అఫ్గాన్‌కు భారత్ మొదట ఆతిథ్యమివ్వాలని నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితంలో ఎప్పటికీ కలిసుండాలని ప్రమాణం చేసుకున్నాం- కోహ్లీ అనుష్క పెళ్లి వీడియో