Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మశాల వన్డే : శ్రీలంక ఘన విజయం

ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవప్రదర్శన కారణంగా కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.

ధర్మశాల వన్డే : శ్రీలంక ఘన విజయం
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (17:28 IST)
ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవప్రదర్శన కారణంగా కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 114 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. 
 
కాగా, ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వికెట్ కీపర్ ధోనీ మరోమారు ఆపద్బాంధువుడి పాత్రను పోషించారు. 
 
ఫలితంగా 38.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన భారతజట్టు 112 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (2), ధావన్ (0), ఎస్ఎస్ అయ్యర్ (9), కార్తీక్ (0), ఎంకే పాండే(2), పాండ్యా (10), భువనేశ్వర్ కుమార్ (0), కులదీప్ యాదవ్ (19), ధోనీ (65), బుమ్రా (0), ఒక్క పరుగు కూడా చేయని చాహల్ నాటౌట్‌గా నిలిచాడు.
 
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 20.4 ఓవర్లలో శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. గుణతిలకా (1), తరంగ (49), తిరుమనే (0), మ్యాథ్యూస్ 25, డిక్ వెలా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంకేయుల దెబ్బకు వణికిపోయిన భారత కుర్రోళ్లు... అత్యల్ప స్కోర్లు ఇవే