Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు- పార్క్ జర్నీ ముగిసింది.. కోచ్‌ను మార్చేసింది..

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (12:31 IST)
PV Sindhu
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోచ్‌ను మార్చేసింది. ఇప్పటివరకు కోచ్‌గా వ్యవహరించిన దక్షిణ కొరియాకు చెందిన పార్క్ తే సంగ్‌ను పక్కనబెట్టేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధ్రువీకరించింది పీవీ సింధు. పార్క్-సింధు కలిసి 2019 నుంచి కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో.. ఈయన కోచింగ్‌లో సింధు పలు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 
 
వీటిలో మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిళ్లు, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్, స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లు వున్నాయి. అలాగే, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.
 
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత ఎడమకాలి గాయం కారణంగా సింధు దాదాపు ఐదు నెలల విరామం తీసుకుంది. ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. దీంతో సింధు-పార్క్‌ల జర్నీకి బ్రేక్ పడింది. పీవీ సింధు పరాజయాలకు పూర్తి బాధ్యత తనదేంటూ పార్క్ ఆ పోస్టులో పేర్కొన్నాడు.   
 
సింధు మార్పును కోరుకుందని, మరో కోచ్‌ను వెతుక్కుంటోందన్న పార్క్.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పుకొచ్చాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

తర్వాతి కథనం
Show comments