Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీ20 ప్రపంచ కప్ : సెమీస్‌లో పోరాడి ఓడిన భారత జట్టు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (08:31 IST)
దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సెమీస్ పోరు జరిగింది. ఇందులో భారత మహిళా జట్టు పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఫలితంగా ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఒక్కరే బ్యాట్‌తో రాణించి అర్థ సెంచరీ చేశారు. ఈ ఓటమితో భారత్ ఇంటి ముఖం పట్టగా, ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
 
173 పరుగులు లక్ష్యఛేదనలో భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మత్ ప్రీత్ కౌర్ 52 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 43 చొప్పున పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరూ క్రీజ్ నుంచి నిష్క్రమించిన తర్వాత దీప్తి శర్మ ఒంటరిపోరాటం చేసినా మ్యాచ్ ఆఖరులో విజయానికి కావాల్సిన పరుగులు పెరిగిపోవడం, బంతులు లేకపోవడంతో రన్‌రేట్ పెరిగిపోయింది. 
 
మ్యాచ్ 20వ ఓవర్‌లో విజయానికి 16 పరుగులు చేయాల్సివుండగా, భారత్ 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో గార్డనర్ 2, డార్సీ బ్రౌన్ 2, మేగాన్ షట్, జెస్ జొనాస్సెన్ ఒకటి చొప్పు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆసీస్ మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments