Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు షాకిచ్చిన తితిదే : అలాంటి భక్తులు కొండపైకి రావొద్దంటూ... (Video)

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (08:45 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తేరుకోలేని షాకిచ్చింది. సర్వదర్శన టిక్కెట్లను గణనీయంగా తగ్గించింది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపించింది. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రభావం దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలపై కూడా పడుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టిక్కెట్లను తగ్గించింది.
 
ఇదే అంశంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలపై కూడా కరోనా ఎఫెక్ట్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని 15 వేలకు పరిమితం చేస్తున్నామని చెప్పారు. 
 
ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఇప్పటికే విడుదల చేశామని... టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే అంశంపై... అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి తిరుమలకు రావాలని కోరారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments