Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసుడు నైవేద్య ప్రియుడు, ఎన్ని వంటలు నైవేద్యమంటే..?

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:08 IST)
శ్రీవారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో నైవేద్యంతో సమర్పించేందుకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. పురాతన కాలం నాటి సాంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలో రెండు నెలల ముందు నుంచి తిరిగి ప్రారంభించింది టిటిడి.
 
ప్రస్తుతం స్వామివారికి సమర్పించే నైవేధ్యానికి ఆర్గానికి పదార్థాలను వినియోగిస్తుండగా భవిష్యత్తులో భక్తులకు అందించే ప్రసాదాలు కూడా ఈ పదార్థాలనే వినియోగించనుంది టిటిడి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్యప్రియుడు. అందుకే శ్రీవారికి ప్రతిరోజు ఆరు సమయాల్లో  నైవేద్యాన్ని సమర్పిస్తారు. వేకువజామున సుప్రభావం మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. 
 
మరే ఆలయంలోను ఇన్ని రకాల ప్రసాదాలు సమర్పించరు. లడ్డు, వడ, అప్పం, దోస, పోలి, చుక్కీలు, పాయసం, మురుకు, జిలేబి, ఇలా ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పూర్వం స్వామివారికి గోవు ఆధారిత పండించిన పదార్థాలతో నైవేధ్యం సమర్పించేవారు. కాలం క్రమేణా వ్యవసాయ పద్ధతులు మారుతూ వస్తుండడంతో నైవేద్యంలో  వినియోగించే పదార్థాలు కూడా మారాయి.
 
గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాల లభ్యత తక్కువగా ఉండడంతో టిటిడి కూడా ఎరువులతో పండించిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించింది. పూర్తిస్థాయిలో వాటినే వినియోగించడం మొదలుపెట్టింది. స్వామివారికి రామానుజస్వామివారు నిర్ధేశించిన విధంగానే నైవేధ్యం సమర్పణ జరుగుతున్నా గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్ధాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు మాజీ పాలకమండలి సభ్యులు శివకుమార్.
 
గోవు ఆధారిత పంటలతో పండించిన పదార్ధాలతో ప్రయోగాత్మకంగా ప్రసాదాలను తయారుచేసి సమర్పించారు. ప్రసాదం రుచి కూడా గతంలో కంటే బాగా పెరగడంతో మొదటిదశలో భాగంగా స్వామివారికి సమర్పించే నైవేధ్యం పెట్టడానికి వీటిని వినియోగించాలని నిర్ణయించింది టిటిడి. 
 
స్వామవారికి ప్రతినిత్యం 194 కేజీల బియ్యంతో 11 కేజీల రవ్వతో ప్రసాదాన్ని తయారుచేస్తారు. వీటిని ఉచితంగా అందిస్తామంటున్నారు రైతు విజయారావు. అంచెలంచెలుగా శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలను వినియోగించాలని టిటిడి పాలకమండలి తీర్మానం చేసింది.
 
దాతలు కూడా టిటిడి గోవు ఆధారిత పంటతో పండించిన పదార్థాలను విరాళాలుగా అందిస్తున్నారు. కోటి రూపాయలు విలువచేసే 26రకాల పదార్ధాలను దేశవ్యాప్తంగా సేకరించి టిటిడికి అందజేశారు చిన్నజియ్యర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు. స్వామివారికి ఆరునెలల పాటు నైవేధ్యం సమర్పించే వస్తువులను అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

తర్వాతి కథనం
Show comments