Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (20:24 IST)
తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తుల్లో కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత పులి సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పర్వదినాలు, ఇతర విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 2వ తేదీన వసంత పంచమితో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 26వ తేదీన మహా శివరాత్రితో ముగుస్తాయి. 
 
ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. 5వ తేదీన- భీష్మాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 
 
6న మధ్వ నవమి, 8న భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష ఉత్సవాలను జరుపుతారు. 12న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, అదే రోజున మాఘ పూర్ణిమ వేడుకలను చేపడతారు. 24వ తేదీన సర్వ ఏకాదశి, 26న మహాశివరాత్రి పండగను కన్నులపండుగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని ముందుగానే అంచన వేయాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

లేటెస్ట్

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

తర్వాతి కథనం
Show comments