ఏంటి? శ్రీవారి హుండీలో ఒక్క రూపాయ్ కూడా వేయకూడదా? చెప్పిందెవరు?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:54 IST)
ఏంటి? శ్రీవారి హుండీలో ఒక్క రూపాయ్ కూడా వేయకూడదా? చెప్పిందెవరు? అంటున్నారు.. శ్రీవారి భక్తులు.. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు మాత్రం శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. 
 
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రమణ దీక్షితులు మాట్లాడుతూ.. హుండీలో స్వామికి ఒక్క రూపాయి కూడా వేయకండని చెప్పారు. హుండీ ఆదాయం రోజుకు రూ. 2 కోట్ల రూపాయల నుంచి 3కోట్ల రూపాయల వరకు వస్తోంది. స్వామివారి సేవకు అందులోంచి ఒక్క రూపాయి కూడా వినియోగించట్లేదన్నారు. 
 
పుష్పాలు, వస్త్రాలు, అలంకరణలు, ఉత్సవాలన్నింటినీ దాతల సహకారంతోనే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫలితంగా హుండీ ఆదాయాన్ని స్వామివారికి ఖర్చుచేసే అవసరం రాకపోవడంతో అది పాపకార్యాలకు వినియోగించే అవకాశం ఉంది. అందుకే భక్తులు కానుకలు హుండీలో వేయడం కంటే ధూపదీపాల్లేని ఆలయాల అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళాలు ఇస్తే.. పుణ్యం వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 
 
శ్రీవారి ఆలయంపై విషం చిమ్మితే స్వామివారు మిమ్మల్ని క్షమించరంటూ హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించిన మీరు.. అర్చక పదవి పోగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

తర్వాతి కథనం
Show comments