హనుమంతుని శరీరమంతా సిందూరం ఉంటుంది.. ఎందుకు..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:58 IST)
సిందూరం అంటే పెట్టుకునే కుంకుమ. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతమ్మను అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పారు.
 
ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే ఆంజేయుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. 
 
ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు.. ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అని అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.  
 
కనుక ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుసార్లు హనుమంతుని సింధూరాభిషేకం చేయించి.. స్వామివారికి నచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తే వారు కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. దాంతో పాటు రాములవారి దర్శనం కూడా దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..

మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...

నిరంతరాయంగా విద్యుత్ కోతలు... విసుగుచెంది కరెంట్ స్తంభమెక్కిన ఎమ్మెల్యే

కుటుంబ కలహాలు : బావమరిదిని హత్య చేసిన బావ

కర్నాటకలో ఘోరం.. బస్సు - లారీ ఢీకొని 10 మంది సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం

2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11

TTD: స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంకలో శ్రీవారి ఆలయాలు

మంగళవారాల్లో హనుమకు లడ్డూ, అరటి పండ్లు సమర్పిస్తే?

తర్వాతి కథనం
Show comments