Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘమాసం ప్రయాగలో స్నానం చేస్తే.. భీష్మ ద్వాదశి.. ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే..?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (05:00 IST)
శివకేశవులకు మాఘ మాసం విశిష్టమైనది. ఎంతో ప్రీతికరమైనది. మాఘ మాసంలో ఉదయం విష్ణు ఆలయం, సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది. మాఘ మాసం పుణ్య తీర్థాల్లో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. 
 
అలాంటి ఈ మాఘ మాసంలో వచ్చే ప్రదోషం రోజున సాయంత్రం పూట శివాలయంలో జరిగే అభిషేకాలను కళ్లారా వీక్షిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. మాఘ ప్రదోష వ్రతం ఫిబ్రవరి 24 (బుధవారం) వస్తోంది. భీష్మ ద్వాదశి అయిన ఈ రోజున వచ్చే ప్రదోష కాలంలో పంచాక్షరిని 108 సార్లు శివాలయంలో స్తుతిస్తే.. సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చేయగల సమర్థుడు. అందుకే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయం అవుతుండా స్నానం చేస్తే మహా పాతకాలు నశిస్తాయి. 
 
ఈ మాసంలో ప్రయాగలో స్నానమాచరిస్తే.. పునర్జమ్మ అంటూ వుండదు. మాఘమాసంలో ఆదివారాలు విశిష్టమైనవి. ఆదివారం నాడు సూర్యుడుని భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకు ఇష్టమైన గోధుమతో చేసిన పదార్థాన్ని కాని.. తీపి పొంగలి కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments