Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేలోకి జగన్ వస్తే ఆహ్వానిస్తాం.. కేసులింకా రుజువు కాలేదు: అథవాలే

ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ మళ్లీ వస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం తప్పుకోవడం బాధాకారమని రాందాస్ అథవాలే చెప్పారు. ఏపీలో వైకాపా కూడా బలమైన పార్ట

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (18:05 IST)
ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ మళ్లీ వస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం తప్పుకోవడం బాధాకారమని రాందాస్ అథవాలే చెప్పారు. ఏపీలో వైకాపా కూడా బలమైన పార్టీ అని... ఎన్డీయేలో చేరాలంటూ ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తాయన్నారు. జగన్‌పై కేసులింకా రుజువు కాలేదని రాందాస్ అథవాలే చెప్పారు. ఏపీలో బలమైన నాయడుకు జగనేనని తెలిపారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ కక్ష సాధింపులకు దిగిందని, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాకే అతనిపై కేసులొచ్చాయని చెప్పారు. 
 
అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు సరిగా లేదని అథవాలే అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి బీజేపీ కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని అథవాలే వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments