Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత రక్తనమూనాలు మా వద్ద లేవు: అపోలో షాక్

బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చే

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (17:00 IST)
బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో అమృత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అమృత డీఎన్ఎ పరీక్ష కేసు మలుపు తిరిగింది.


ఈ అంశంపై అమృత దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది. 2016 జయమ్మ అనారోగ్యంతో 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జయలలిత కుమార్తెనని అమృత నిరూపించుకోవాలంటే.. జయలలితకు సంబంధించిన బయోలాజికల్‌ నమూనాలు ఏవైనా సేకరించి ఉంచారా, లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని అపోలో ఆస్పత్రిని కోర్టు బుధవారం (ఏప్రిల్ 25) ఆదేశించింది.

కానీ అపోలో ఆస్పత్రి మాత్రం తమ వద్ద బయోలాజికల్ శాంపిల్స్ లేవని షాక్ ఇచ్చింది. ఇంతకుముందు.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి సీసీటీవీ దృశ్యాల గురించి కోరగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇదేవిధమైన సమాధానం చెప్పి అందర్నీ షాక్‌కు గురిచేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments