Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్న కేరళ రాష్ట్రం

ఆగస్ట్ నెలలో వచ్చిన వరదలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వరద భీభత్సం నుండి త్వరగానే కోలుకున్నట్లుంది. అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే ఆ రాష్ట్ర టూరిజం గురించి సాంసొనైట్ బ్రాండ్ 1 నిమిషం 40 సెకన్ల నిడివి గల వీడియోని రూపొందించింది. అ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:07 IST)
ఆగస్ట్ నెలలో వచ్చిన వరదలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వరద భీభత్సం నుండి త్వరగానే కోలుకున్నట్లుంది. అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే ఆ రాష్ట్ర టూరిజం గురించి సాంసొనైట్ బ్రాండ్ 1 నిమిషం 40 సెకన్ల నిడివి గల వీడియోని రూపొందించింది. అందులో టూరిజంపై ఆధారపడి జీవించే వారిని చూపిస్తూనే వారు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసారు. 
 
భారతదేశంలో కేరళ రాష్ట్రం అనేక సందర్శనీయ ప్రదేశాలను, కళలను, కళాఖండాలను, కళాకారులను కలిగి ఉంది. సాంసొనైట్ సంస్థ రూపొందించిన వీడియోలో కస్టమర్‌ల కోసం వేచి ఉన్న హోటల్ యజమానిని, ప్రయాణీకుల కోసం ఎదురు చూసే లేడీ ట్యాక్సీ డ్రైవర్‌ను, ప్రేక్షకుల కోసం ఎదురు చూసే కథాకళి నృత్యకారుడిని, అదే విధంగా వేయించిన చేపలను విక్రయించే ఫాతిమా కొనే వారి కోసం వేచి చూస్తున్నట్లు చూపించారు. 
 
చివరగా పర్యాటకుల కోసం "వి ఆర్ ఒపెన్" అంటూ చూపించి అందరినీ ఉద్విగ్నానికి గురైయ్యేలా చేసారు. ఏదైమైనా కేరళ రాష్ట్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని ఈ వీడియో చెప్పకనే చెప్పింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments