Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్‌బీ ఫ్రెండ్‌తో ఎస్సై పరీక్షలకు వెళ్తే... కారులోనే ఎంత పనిచేశాడంటే?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (10:16 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. యూపీలో మధురలో ఎస్సై పరీక్ష రాసి తిరిగి వస్తున్న యువతిపై ఓ యువకుడు కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల బాధిత యువతికి ఫేస్‌బుక్ ద్వారా హర్యానాలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం స్నేహంగా మారింది. 
 
ఈ క్రమంలో ఎస్సై పరీక్ష రాసేందుకు అతనితో కలిసి వెళ్ళింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న తేజ్‌వీర్ తన డ్రైవర్‌తో కలిసి కారులో ఆగ్రా వెళ్లి ఆమె పరీక్ష రాస్తున్న సెంటర్ బయట కాపుకాశాడు.
 
పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆపై మత్తుమందు ఇచ్చి కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం స్పృహతప్పిన ఆమెను ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తేజ్‌వీర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments