Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానేరు డ్యాంలో యువతి మృతదేహం.. ఏం జరిగింది..?

Advertiesment
woman
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. రోజు రోజుకీ మహిళపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మానేరు డ్యాంలో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియ‌ని యువ‌తి శవం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో ల‌భ్య‌మైంది. 
 
యువతి మృతి పై పలు అనుమానాలున్నాయ‌ని స్థానికులు అంటున్నారు. ఆ యువతిపై దాడి జరిగిందా లేకుంటే అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అంతేగాకుండా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా ? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరద సాయం చేయాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ