Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుడ్డివాడిని చేసిన ప్రేమ : ప్రియుడిపై ద్రావకంతో ప్రియురాలి దాడి

గుడ్డివాడిని చేసిన ప్రేమ : ప్రియుడిపై ద్రావకంతో ప్రియురాలి దాడి
, ఆదివారం, 21 నవంబరు 2021 (12:09 IST)
తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ పోసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ చర్యకు పాల్పడిన ఆ యువతిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురం, పూజపుర అనే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ (27) అనే యువకుడు ఆదిమాలి పట్టణానికి చెందిన షీబా (35) అనే మహిళను ప్రేమించాడు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రేమ కొనసాగింది. పైగా, కొంతకాలంగా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిని షీబా ఒత్తిడి చేసింది. కానీ, ఏడేళ్ళ వయస్సు వ్యత్యాసం ఉండటంతో అరుణ్ కుమార్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన షీబా... ప్రియుడి ముఖంపై యాసిడ్ పోయడంతో అతనికి కంటి చూపు పోయింది. 
 
ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి షీబాను అరెస్టు చేశారు. అరుణ్ కుమార్‌కు మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కాలేజీకి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్పల్పంగా పెరిగిన పాజిటివ్ కేసులు .. 313 మంది మృతి