Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో దారుణ ఘటన-కాబోయే భర్త ఇంట్లో యువతి శవమై..?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (11:32 IST)
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ఇంటిలో యువతి శవమై కనిపించింది. కులం కారణంగా తమ బిడ్డను చంపేసి వుంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే  ఆత్మహత్య చేసుకుందని అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే ఐశ్వర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి.  అశోక్ కుమార్ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
 
ఇంకా తల్లిదండ్రులు కఠినమైన షరతులు పెట్టారు. అంతేకాదు, పెళ్లికి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఎవరూ రావొద్దని షరతు పెట్టారు. ఇందుకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి పెళ్లి నవంబర్ 23వ తేదీన ఫిక్స్ అయింది.
 
పెళ్లికి ముందు జరగాల్సిన తంతు కూడా మొదలైంది. ఇందులో ఐశ్వర్య కూడా పాల్గొంది. కానీ, సోమవారం ఆమె ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. 
 
ఈ ఘటనపై యువతి తండ్రి సరైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ బిడ్డ దళిత కమ్యూనిటీకి చెందిన యువతి కాబట్టి హత్య చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments