Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న భార్యపై సిలిండర్‌ వేశాడు.. ఇంటి వాకిట్లో పందిరికి ఉరేసుకున్నాడు...

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (11:41 IST)
భార్యాభర్తల గొడవలు చివరికి ప్రాణాలను బలిగొంది. చిన్నపాటి గొడవలకే ఆవేశానికి గురవుతూ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోవైలోని వేడపట్టికి చెందిన మారిముత్తు (65) ఓ ప్రైవేట్ కంపెనీకి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతని రెండో భార్య సుబ్బమ్మ. ఈ దంపతులు సంతానం లేరని తెలుస్తోంది. వీరితో మారిముత్తు సోదరుడు కృష్ణ కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇతడు మానసిక రోగి అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మారిముత్తు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆపై సుబ్బమ్మ నిద్రపోయింది. భార్య నిద్రపోతున్న సమయంలో గొడవపడిందనే ఆవేశంతో భర్త మారిముత్తు సిలిండర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆపై జరిగిన విషయానికి పశ్చాత్తాపపడిన మారిముత్తు ఇంటి వాకిట్లోనే పందిరికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న మారిముత్తు ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments