Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ సర్.. నేను ఆ పదవికి అర్హుడను కాను : కేశినేని నాని షాక్

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (11:34 IST)
తెలుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తేరుకోలేని షాకిచ్చారు. తాను టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉపనేత పదవికి అర్హుడను కాదని పేర్కొంటూ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. పైగా, తనకంటే సమర్థుడైన నేతను ఆ పదవికి ఎంపిక చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ఫేస్‍‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
కాగా, ఎంపీ కేశినేని నానిని లోక్‌సభలో టీడీపీ ఉపనేతగా, పార్టీ విప్‌గా ఎన్నుకోగా, సీఎం రమేశ్‌ను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ పదవి ప్రకటించి 24 గంటల్లో ఆయన యుటర్న్ తీసుకున్నారు. ఈ పదవికి తాను సరిపోనని.. తనకంటే సమర్థుడైన మరో వ్యక్తిని పార్టీ విప్ పదవికి ఎంపిక చేయాలని కోరుతూ కేశినేని శ్రీనివాస్ చంద్రబాబుకు లేఖ రాశారు. 
 
తనను విప్ పదవిలో నియమించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ తాను ఈ పదవికి అర్హుడిని కాను. విప్ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవచ్చునని అనుకుంటున్నానని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. విజయవాడ నుంచి కేశినేని శ్రీనివాస్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గెలుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments