Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి వెళ్లి చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ఇంటి దొంగలు

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:08 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. చోరీకి వెళ్ళిన ఇంటి దొంగలు... ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. అంటే.. 12 యేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన కృష్ణుడు అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగించసాగాడు. 2006లో కృష్ణుడు తన సహచరుల్లో ఒకరితో కలిసి దొంగతనానికని సుల్తాన్‌పురిలోని ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. 
 
అప్పుడు ఇంట్లో ఉన్న మహిళ శబ్దం చేయడంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో కృష్ణను పోలీసులు అరెస్టు చేయగా కోర్టు జీవితఖైదు విధించింది. కానీ జైలు అధికారులు సత్ప్రవర్తన కారణంగా కృష్ణుడిని 2014లోనే విడుదల చేశారు.
 
అయితే, ఆగస్టు 4న కృష్ణుడు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను చూసి మొదట ఆమెపై లైంగికదాడి చేశాడు. తర్వాత ఆమెను చంపాలని కుట్టు మిషన్‌తో తలపై మోది, పదునైన యంత్రంతో పలుమార్లు దాడి చేశాడు. బాలిక రక్తపు మడుగులో పడిపోవడంతో అమ్మాయి చనిపోయిందని భావించి.. ఇంట్లో దొరికిన రూ.200 తీసుకొని పారిపోయాడు. కానీ, పోలీసులు 48 గంటల్లో మంగోల్‌పురిలో కృష్ణుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం