Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

కరోనా వైరస్ దెబ్బకు సచివాలయం మూసివేత.. ఎక్కడ?

Advertiesment
West Bengal
, ఆదివారం, 2 ఆగస్టు 2020 (12:59 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉన్న సచివాలయం నబన్నాను అధికారులు మూసివేశారు. సోమ, మంగళవారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు తెలిపారు. 
 
సచివాలయంలో విధులు నిర్వహించే సబ్‌‌ఇన్‌స్పెక్టర్‌‌ ఒకరికి కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్ఐని 14వ అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో విధుల్లో ఉన్నారని, హౌరా జిల్లా పక్కనే ఉన్న సచివాలయంలో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపడుతారన్నారు. 
 
‘నబన్నా’ అధికారులు, సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటి నుంచే పని చేస్తారన్నారు. కాగా, ఎస్‌ఐ భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని, ఇద్దరిని రాజర్‌హాట్‌ ప్రాంతంలోని దవాఖానలో చేర్పించారని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మంది సిబ్బందితో ‘నబన్నా’ పని చేస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ ప్రతి రోజు కార్యాలయానికి హాజరవుతున్నారని అధికారి పేర్కొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకి ఉత్తరప్రదేశ్ విద్యా మంత్రి మృతి