Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన బీజేపీ కేంద్ర మాజీ మంత్రి

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:45 IST)
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై ఓ న్యాయ విద్యార్థిని సంచలన ఆరోపణలు చేసింది. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశారంటూ ఆరోపించారు. అలా ఆరోపణలు చేసిన మరుక్షణమే ఆ విద్యార్థిని అదృశ్యమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని ఎస్‌ఎస్‌ న్యాయ కాలేజీ విద్యార్థికి  చెందిన చిన్మయానంద్‌ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. 
 
'నాది షాజహాన్‌పూర్‌. నే ను ఎస్‌ఎస్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నాను. ఓ స్వామిజీ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. అతనికి వ్యతిరేకంగా నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. 
 
మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ నన్ను ఆదుకోవాలి. నాకు న్యాయంచేయండి' అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. శుక్రవారం ఈ వీడియో షేర్‌ చేసిన విద్యార్థిని.. శనివారం నుంచి అదృశ్యమైంది. 
 
ఇదిలావుంటే, న్యాయ విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు స్వామి చిన్మయానంద్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కిడ్నాప్‌, బెదిరింపుల కేసును నమోదు చేశారు. అయితే బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నట్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం