ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి విడత పోలింగ్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (07:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరి, మలివిడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఈ దశలో అధికార భారతీయ జనతా పార్టీతో పాటు... సమాజ్ వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్రమైన పోటి నెలకొనివుంది. 2017లో జరిగిన జరిగిన ఎన్నికల్లో మొత్తం 54 సీట్లలకు బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. 
 
చివరి దశలో అజామ్ గఢ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలీ వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడు రోజుల పాటు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, ఎస్పీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధినే అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురిలతో కలిసి ప్రచారం చేశారు. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments