Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి విడత పోలింగ్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (07:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరి, మలివిడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఈ దశలో అధికార భారతీయ జనతా పార్టీతో పాటు... సమాజ్ వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్రమైన పోటి నెలకొనివుంది. 2017లో జరిగిన జరిగిన ఎన్నికల్లో మొత్తం 54 సీట్లలకు బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. 
 
చివరి దశలో అజామ్ గఢ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలీ వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడు రోజుల పాటు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, ఎస్పీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధినే అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురిలతో కలిసి ప్రచారం చేశారు. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments