Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో మహిళా టూరిస్ట్ గైడ్‌పై సామూహిక బలాత్కారం

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:04 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా టూరిస్ట్ గైడ్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ గ్యాంగ్ రేప్ ఓ స్టార్ హోటల్‌లో జరగడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐష్ సింఘాల్ కథనం ప్రకారం.. కనాట్ ప్లేస్‌ మార్కెట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఇండియా గేట్ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బాధిత మహిళ టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తోంది. హోటల్‌లో ఆదివారం తనపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
హోటల్‌లో గదిని బుక్ చేసుకున్న నిందితులు బాధితురాలికి డబ్బు అవసరం ఉన్నట్టు గుర్తించారు. తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని నమ్మబలికి హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజ్ శర్మను అరెస్టు చేసినట్టు సింఘాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం