Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో జాబ్ ఫ్రాడ్స్.. కోట్లాది రూపాయల మోసం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:31 IST)
విదేశాలతో పాటు, ప్రముఖ కంప్యూటర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కేరళ యువకుల నుంచి లక్షల్లో డబ్బులు దోచేశారు. ఈ విషయమై ఆ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు కాసర్‌గోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
తిరువనంతపురంకు చెందిన శరణ్య, పాలక్కాడ్‌కు చెందిన మను దంపతులు యువకులను మోసగించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు ఇదే కేరళలో టైటానియం జాబ్ ఫ్రాడ్ కేసులో తాజాగా రూ.15 కోట్ల మోసం జరిగినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దివ్య నాయర్ భారీ మొత్తంలో డబ్బును స్వాహా చేసినట్లు పోలీసులకు చెప్పారని, ఆమె డైరీలో కోటి రూపాయలకు పైగా లావాదేవీల వివరాలు ఉన్నాయని సమాచారం. 
 
కాగా, ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ట్రావెన్‌కోర్ టైటానియం ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TTP)లీగల్ ఏజీఎం శశికుమారన్ థంపిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో దివ్య జ్యోతి అలియాస్ దివ్య నాయర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో టీటీపీ లీగల్ ఏజీఎంపై చర్యలు తీసుకుంది. 
 
ఈ కేసులో దివ్య భర్త రాజేష్, తంపి స్నేహితులు ప్రేమ్ కుమార్, శ్యామ్‌లాల్‌లు ఇతర నిందితులుగా ఉన్నారు. పోలీసులు దివ్యను పట్టుకున్నప్పటికీ, మిగతా నిందితులందరూ పరారీలో వున్నారు. నిందితులు ఓ ముఠాగా ఎంపికై.. టీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బును కాజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments