నలుగురు కూతుళ్లను గొంతుకోసి చంపేసిన తల్లి.. 8 నెలల బిడ్డను కూడా వదిలి పెట్టలేదా..?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (16:41 IST)
క్షణికావేశాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఓపిక లేకపోవడం.. ఆవేశాలకు గురికావడంతో నేరాలు జరిగిపోతున్నాయి. తాజాగా గుర్గామ్‌లో దారుణం చోటుచేసుకుంది. నలుగురి కూతుళ్ల గొంతులు కోసి తానూ ఆత్మహత్య చేసుకుంటుండగా ఒక తల్లి పట్టుబడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుర్‌గామ్‌కు సరిహద్దు గ్రామమైన పిప్రోలి గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉంటున్న ఫర్మినాకు ఖుర్షీద్ కు 2012లో వివాహమైంది. ఫర్మినాకు ఇది రెండో వివాహం. వీరికి నలుగురు సంతానం. 
 
కాగా.. వారిలో చివరికూతురు వయసు 8 నెలలే. మిగిలిన వారి వయసు కూడా పదేళ్లకు మించదని స్థానికులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఫర్మీనా.. అర్థరాత్రి తన నలుగురు కూతుళ్ల గొంతు కోసి హత్య చేసింది. నలుగురిని ఒకే కత్తితో గొంతు కోసి చంపేసింది. నలుగురిని చంపి తానూ గొంతు కోసుకుంటుండంతో అదే సమయంలో ఖుర్షీద్ ఇంటికి చేరుకున్నాడు.
 
కిటికీలోంచి ఇది చూసిన ఖుర్షీద్.. తలుపులను గట్టిగా బాదాడు. వాటిని బద్దలు కొట్టుకుని వెళ్లగా.. ఆమె అప్పటికే హత్యాయత్నానికి పాల్పడుతుంది. దీంతో ఖుర్షీద్.. ఆమె దగ్గరున్న కత్తిని తీసుకున్నాడు. పక్కనున్న గదిలోకి వెళ్లి చూసేసరికి నలుగురు కూతుళ్లు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. అనంతరం ఫర్మీనాను ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఫర్మీనా తన కూతుళ్లను ఎందుకోసం చంపిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఖుర్షీద్, ఫర్మీనా అన్యోన్యంగానే ఉండే వారని.. వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయినా ఫర్మీనా ఎందుకిలా చేసిందనే దానిమీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments