Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డివాడిని చేసిన ప్రేమ : ప్రియుడిపై ద్రావకంతో ప్రియురాలి దాడి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (12:09 IST)
తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ పోసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ చర్యకు పాల్పడిన ఆ యువతిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురం, పూజపుర అనే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ (27) అనే యువకుడు ఆదిమాలి పట్టణానికి చెందిన షీబా (35) అనే మహిళను ప్రేమించాడు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రేమ కొనసాగింది. పైగా, కొంతకాలంగా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిని షీబా ఒత్తిడి చేసింది. కానీ, ఏడేళ్ళ వయస్సు వ్యత్యాసం ఉండటంతో అరుణ్ కుమార్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన షీబా... ప్రియుడి ముఖంపై యాసిడ్ పోయడంతో అతనికి కంటి చూపు పోయింది. 
 
ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి షీబాను అరెస్టు చేశారు. అరుణ్ కుమార్‌కు మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కాలేజీకి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments