Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి లక్షణాలుంటే 7 రోజుల్లోపు పరీక్షలు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:55 IST)
కరోనా కేసులను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా భారత వైద్య పరిశోధన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, దగ్గు, గొంతులో ఇబ్బంది, జలుబు వంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవారందరికీ ఏడు రోజుల్లోపు రియల్‌టైమ్ రివర్స్ ట్రాన్స్‌ క్రిప్షన్-పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది.

ఈ పరీక్షల్లో నెగటివ్ వస్తే ఏడు రోజుల తర్వాత యాంటీ బాడీ టెస్ట్‌లు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కరోనా వ్యూహాన్ని సవరించిన ఐసీఎంఆర్.. వైరస్‌ సోకిన వారితో ప్రత్యక్ష సంబంధమున్న వారిని..ముప్పు ఎక్కువగా ఉన్నవారిగా పరిగణించాలని సూచించింది.

వారు సన్నిహితంగా మెలిగిన నాటి నుంచి 5-14 రోజుల మధ్యలో... ఒకసారి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. హాట్‌స్పాట్లు, క్లస్టర్లు, ఎక్కువమంది వలస కూలీలు గుమికూడిన ప్రదేశాలు, ఖాళీ చేయించిన ప్రాంతాల్లో 5 నుంచి 14 రోజుల మధ్యలో పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

తీవ్ర శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ పరీక్షలు చేయాలన్న ఐసీఎంఆర్.. విదేశాల నుంచి వచ్చి కరోనా లక్షణాలతో కనిపిస్తున్నవారు, పాజిటివ్‌గా తేలినవారితో సంబంధమున్న వారు, వైరస్‌ లక్షణాలు కనిపించే వైద్య ఆరోగ్య సిబ్బందికి పరీక్షలు చేయాలని నిర్దేశించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments