Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను సాగనంపేందుకు వచ్చి.. రైలు నుంచి కిందపడ్డాడు.. అంతే?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (10:50 IST)
తల్లిదండ్రుల కళ్ల ముందే దారుణం జరిగిపోయింది. తల్లిదండ్రులను సాగనంపేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో టెక్కీ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజికోడే గ్రామానికి చెందిన విక్రమ్ విజయన్ (28) బెంగళూరులోని విప్రో కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో విక్రమ్‌ను చూసేందుకు అతని తల్లిదండ్రులు బెంగళూరు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కేరళకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో కర్మేలారం రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులను విక్రమ్ రైలు ఎక్కించి సాగనంపేందుకు వచ్చాడు.  రైలు కదలబోతుండగా దిగేందుకు విక్రమ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కింద పడ్డ విక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరోవైపు కుమారుడు పడిపోవడాన్ని గమనించిన విజయన్ తానూ రైలు దిగబోయి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే పెంచి పెద్ద చేసిన కుమారుడు కోల్పోవడం ఆ దంపతులను తీవ్రంగా కలచివేసింది. రైలు నుంచి తమ బిడ్డ కిందపడిపోతుండటం చూసి ఏమీ చేయలేకపోయామని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని వారు రోదిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments