పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్‌ని తరగతి గదిలోనే..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (17:53 IST)
పెళ్లికి ఒప్పుకోలేదని తరగతి గదిలోనే ఓ టీచరమ్మను హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ పాఠశాలలో గణితం భోధించేందుకు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై రాజశేఖర్ అనే వ్యక్తి దాడి చేసాడు. బాధితురాలి ఇల్లు విద్యాసంస్థకు సమీపంలోనే ఉండటంతో ఆమె త్వరగానే పాఠశాలకు చేరుకుంది. 
 
ఇదే అదునుగా చూసిన నిందితుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రస్తావనను తిరస్కరించినందుకే ఆమెపై దాడికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాలేజీలో చదువుకునే సమయంలోనే నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల క్రితం బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు రాజశేఖర్ వివాహ ప్రస్తావనను తీసుకురావడంతో వారు అందుకు సమ్మతించలేదు. పెళ్లికి నిరాకరించారనే కోపంతోనే నిందితుడు దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments