Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని వివాహితను కత్తితో పొడిచిన యువకుడు

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (16:51 IST)
ఇపుడు ఒంటరిగా ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు... ప్రేమిస్తున్నానని వెంటపడటం కొంత మంది కుర్రాళ్లకు సరదాగా మారిపోయింది. కానీ ఓ యువకుడు వివాహిత వెంట పడ్డాడు. ప్రేమిస్తున్నాని వేధించసాగాడు. చివరికి గొడవపడి కత్తితో దాడి చేశాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జ్యోతినగర్‌ ఆటోనగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆటోనగర్‌లో నస్పూరి శ్రీనివాస్ ‌(29) ఇల్లు చంటి స్రవంతి (25) ఇంటికి దగ్గర్లోనే ఉంది. స్రవంతికి దాదాపు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇప్పుడు భర్తకు దూరంగా తన పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆమెపై శ్రీనివాస్ కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. తన ప్రేమను అంగీకరించాలంటూ పట్టుబట్టాడు. అమె ససేమిరా అంగీకరించలేదు. 
 
ఈ క్రమంలో గురువారం సాయంత్రం స్రవంతి రహదారిపై వెళుతుండగా గమనించాడు. మళ్లీ వెంటపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ ఆవేశంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను గోదావరిఖని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందటంతో వారు బాధితురాలి ఫిర్యాదును స్వీకరించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments