Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి వెయ్యి కోట్లిచ్చాం.. తప్పంతా చంద్రబాబుదే: అమిత్ షా ఆశ్చర్యం

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీ

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (14:10 IST)
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలగడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
ఎన్డీఎ నుంచి వైదొలగాలని చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. తప్పంతా బాబుదేనని. ఏపీకి ఎంతో చేశామని లేఖలో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా చంద్రబాబు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని అమిత్ షా చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశారని తెలిపారు. మూడు ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చామన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చిందని.. కానీ రాష్ట్రం కేవలం 12 శాతం మాత్రమే అమరావతి కోసం ఖర్చు చేసిందని అమిత్ షా ఆరోపించారు. ఇలా 12 శాతం ఖర్చుచేసి, 8 శాతానికి మాత్రమే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందని అమిత్ షా తెలిపారు. అమిత్ షా రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments