Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ వెళ్లినా మాకొచ్చిన నష్టమేమీ లేదు : అమిత్ షా

ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లినంత మాత్రానా తమకొచ్చే నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆయన ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర

Advertiesment
Amit Shah
, గురువారం, 22 మార్చి 2018 (14:46 IST)
ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లినంత మాత్రానా తమకొచ్చే నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆయన ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 
 
టీడీపీ వైదొలగాలని తాము కోరుకోలేదని, వాళ్లే వెళ్లిపోవాలనుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు ఎవరు ఆపగలరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్డీయే పట్ల ఆకర్షితులయ్యారని, అది వాస్తవమని అమిత్‌షా తెలిపారు.
 
టీడీపీ వీడినంత మాత్రాన నష్టమేమీ లేదని, తమ కూటమికి 30 పార్టీలు అండగా ఉన్నాయన్నారు. అలాంటప్పుడు తామెందుకు బాధపడాలని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ తెగతెంపులు బీజేపీ దక్షిణాది ఆశలపై నీళ్లు చల్లాయని భావిస్తున్నారా అని అమిత్‌షాను అడగ్గా.. మేము దక్షిణాదిలో ఇప్పటికీ బలంగానే ఉన్నామని అమిత్‌షా వ్యాఖ్యానించడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ ఖాతాదారులకు క్షమాపణలు చెప్చిన జుకర్ బర్గ్... ఎందుకు?