Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ మైకంలో అంతా చెప్పేసింది.. కిడ్నీలేదనడంతో.. పెళ్లి?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (09:59 IST)
ప్రేమ మైకంలో ప్రియుడితో అంతా చెప్పేసింది ఆ ప్రియురాలు. తనకు ఒక కిడ్నీ మాత్రమే వుందనే విషయాన్ని పెళ్లికి ముందే చెప్పేసింది. కానీ ఆ నిజమే ఆ ప్రేమికుల పెళ్లిని ఆపేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆలందూరుకు చెందిన విఘ్నేశ్ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన అమ్మాయితో పీకలోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
రెండేళ్ల పాటు వారు ప్రేమలో వున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అదే ఊపులో తనకు పుట్టినప్పటి నుంచి ఓ కిడ్నీ లేదనే రహస్యాన్ని ప్రియుడు వద్ద చెప్పింది. కిడ్నీ లేకపోవడం పెళ్లికి సమస్య కాదని చెప్పిన ప్రియుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. 
 
కొద్ది రోజులకే యువతి తండ్రి చనిపోవడం.. యువతి కష్టాలకు కారణమైంది. యువతి తండ్రి మరణించడంతో విఘ్నేశ్ కుటుంబం ప్లేటు మార్చింది. కట్నంగా బంగారం అడిగింది. కిడ్నీ మార్చితేనే పెళ్లంటూ పట్టుబట్టారు. ఇక చేసేది లేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments