Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి.. ఆ వృద్ధుడు చితిపై పడుకుని నిప్పంటించుకున్నాడు

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (18:38 IST)
వృద్ధుడైపోయాడు. భార్య కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అన్నీ తానై చూసుకోవాల్సిన కుమారుడు కూడా మరణించాడు. ఇక ఒంటరితనం ఆ వృద్ధుడిని వేధించింది.

అనాథగా మారిపోయిన అతనికి భార్య, కుమారుడి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయి. దాంతో తనను తాను పోషించుకోలేక.. జీవితంపై విరక్తితో ఆ వృద్ధుడు తనకు తానే చితిని పేర్చుకుని.. దానిపై పడుకుని నిప్పంటించుకున్నాడు. 
 
ఈ ఘటన తమిళనాడు, తిరుప్పూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరుకు చెందిన అజ్జప్ప (85) కుమారుడు సిద్ధప్ప (58) గత ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.
 
కోడలు, మనవళ్లు ఉన్నా.. గొడవల కారణంగా పట్టించుకోలేదు. దాంతో అజ్జప్ప మానసికంగా కృంగిపోయాడు. ఊరు వదలి వెళ్లిపోయి దేవాలయాలు, పాడుబడ్డ భవనాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఐతే నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదు. ఈ క్రమంలో గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో సగం కాలిన వృద్ధుడి శవాన్ని గుర్తించిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహం అజ్జప్పదని తేల్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments