Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడును ముంచెత్తిన వరదలు - రైళ్లలోనే 800 మంది ప్రయాణికులు

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (12:13 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇపుడు దక్షిణాది జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తిరునెల్వేలి, తూత్కుక్కుడి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. 
 
ఈ కారణంగా ఈ నాలుగు జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. తిరుచ్చెందూరు నుంచి చెన్నైకు వెళుతున్న ప్రయాణికుల రైలు వరద నీటిలో చిక్కుకుని పోయింది. శ్రీవైకుంఠం వద్ద ఈ రైలు గత 20 గంటలుగ నిలిచిపోయివుంది. ఇందులో సుమారుగా 800 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 300 మంది సమీపంలోని ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.
 
తిరునల్వేలి - తిరుచెందూర్ సెక్షన్‌లో శ్రీవైకుంఠం వద్ద వంతెన కొట్టుకుని పోయింది. దీంతో ట్రాక్ నీటిపై వేలాడుతుంది. రైలు పట్టాలపై నీరు ప్రవహిస్తున్నందున దక్షిణ రైల్వే ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సాధారణ జీవితం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సేవలను కోరింది. వర్ష ప్రభావిత జిల్లాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments