Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విషయం చెప్పిందని కూతుర్ని చంపేసింది..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (13:50 IST)
స్మార్ట్‌ఫోన్లు, ఆధునికత పెరగడంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం కన్నబిడ్డలనే మట్టుబెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
 
తాజాగా అక్రమసంబంధ వ్యవహారాన్ని భర్తకు చెప్పేసిన కన్నకూతురిని హతమార్చింది.. ఓ కిరాతక తల్లి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న వీరగనూర్ జిల్లాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి... సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య ప్రియాంక గాంధీ, నాలుగేళ్ల శివానితో కలిసి ఇక్కడే వీరగనూర్ గ్రామంలో నివసిస్తోంది. 
 
భర్త ఎక్కడో దూరంగా ఉండడంతో అదే ఊరిలో వున్న వెంకటేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇంట్లో తల్లీకూతురు ఇద్దరూ మాత్రమే ఉండడంతో... అక్కడే యథేచ్ఛగా శారీరక సంబంధం కొనసాగించేవారు. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న శివానీ సింగపూరులోని తండ్రికి ఈ విషయం వెల్లడించింది. దీంతో కూతురిపై అక్కసు పెంచుకున్న ప్రియాంకా గాంధీ.. కూతుర్ని బోరు బావిలో వేసి హత్య చేసింది. అయితే తనపై అనుమానం రాకుండా వెనకాలే ప్రియాంక కూడా దూకేసింది. 
 
తల్లీకూతుర్లు ఇద్దరూ బోరుబావిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు బయటికి తీశారు. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments