Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్-2 : జైషే స్థావరాలపై లేజర్ బాంబుల వర్షం... దాడులు నిజమేనన్న పాక్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (09:54 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ భూభాగంలో ఉన్న జైషే ఈ మొహమ్మద్ స్థావరాలపై భారత్ వైమానిక దళాలు మంగళవారం వేకువజామున మెరుపుదాడులు చేశారు. ముఖ్యంగా, జైషే ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా లేజర్ గైడెడ్ బాంబుల వర్షం కురిపించాయి. 
 
భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భీకరదాడులు జరిపా​యి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. 
 
అయితే, తమ భూభాగంలోకి వచ్చి భారత్ వైమానికదళాలు దాడులు చేసినట్టు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ధృవీకరించారు. "భారత్‌ సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరిపిస్తోంది. పాక్‌ వైమానిక దళం ఎదురు దాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కు వెళ్లాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గఫూర్‌ స్పష్టం చేశారు. భారత్‌ వైమానిక దాడుల అనంతరం దానికి సంబంధించి ఫోటోలను పాక్‌ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
 
అయితే, ఈ దాడులపై భారత రక్షణ శాఖ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరికొద్దిసేపట్లో ఈ దాడి గురించి అధికారికంగా మీడియా సమావేశంలో వెల్లడించనుంది. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. మరోవైపు శ్రీనగర్‌లోని వేర్పాటు వాదుల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వేర్పాటువాదులు యాసిన్‌, మిర్వాయిజ్‌, షబీర్‌ షా, ఆశ్రఫ్‌ ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments