Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారి ఇవ్వమని అడిగినందుకు ఉంగరపు వేలిని కొరికేసిన కారు యజమాని...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (09:16 IST)
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు యజమాని విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. కాస్త దారి ఇవ్వమని అడిగినందుకు ఓ ద్విచక్రవాహనదారుడు ఉంగరపు చేతివేలిని కొరికేశాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మౌలాలి హనుమాన్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ అనే వ్యక్తి స్థానికంగా పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఈనెల 24వ తేదీన తన ద్విచక్రవాహనంపై లాలాపేట్‌ వెళుతుండగా మౌలాలి కమాన్‌ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్‌ కోరడంతో ఆగ్రహానికిలోనైన కారు డ్రైవర్‌ మహ్మద్‌ ఆలి అతడిని దూషించడమే కాకుండా అతడిపై దాడి చేసి కుడిచేతి ఉంగరం వేలు కొరికాడు. దీంతో అతని చేతి వేలు తెగి కిందపడిపోయింది. 
 
ఆ తర్వాత తెగిపడిన ఉంగరపు వేలితో జాఫర్ ఆస్పత్రికి వెళ్లగా, వారు చికిత్స చేసి అతికించారు. ఆ తర్వాత ఈ ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు మహ్మద్‌ ఆలిని సోమవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్‌ ఆలి మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments