Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వంతో వ్యవహరించిన సుప్రీం.. మరణశిక్షను అలా తగ్గించింది

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (20:02 IST)
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఓ దోషిపై సుప్రీంకోర్టు మానవత్వంతో వ్యవహరించింది. కింది కోర్టు అతనికి విధించిన మరణ శిక్షను తగ్గించింది.
 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, బేలా ఎం. త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నేరస్థులకు విధించే ఉరి శిక్ష ప్రతి సందర్భంలోనూ నిర్ణయాత్మక అంశం కాదని ధర్మాసనం పేర్కొంది.
 
''దోషిపై అభియోగాలు మోపిన నేరాలపై దిగువ న్యాయస్థానాలు తీసుకున్న అభిప్రాయాన్ని ధృవీకరిస్తూ, శిక్షార్హమైన ఈ నేరానికి మరణ శిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం సరైనదని భావిస్తున్నాం." అంటూ పేర్కొంది. జీవితాంతం జైలు శిక్షకు బదులుగా 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం సముచితమని కోర్టు తెలిపింది. 
 
కానీ  376A, POCSO చట్టం కింద ఇతర నేరాలకు సంబంధించి దిగువ కోర్టులు నమోదు చేసిన నేరారోపణలు, శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అవుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.'' అని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
 
ఫిరోజ్ అనే వ్యక్తి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేశాడనే నేరంపై జిల్లా కోర్టు అతనికి మరణ శిక్షను విధించింది. ఐపీసీ సెక్షన్ 302 కింద నేరం చేసినందుకు నిందితుడు ఫిరోజ్‌కి మరణ శిక్షతో పాటు ఏడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments