Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు షాక్: బ్లాక్ ఫిల్మ్‌తో తంటా.. రూ.700లు జరిమానా

trivikram srinivas
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:27 IST)
తెలుగు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. త్రివిక్రమ్ కారును జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. 
 
సోమవారం జూబ్లీహిల్స్‌లో వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న ఓ కారును గమనించి ఆపారు. ఆ సమయంలో కారులో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు. 
 
నిబంధనల ప్రకారం కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదని ఆయనకు సూచించిన పోలీసులు దాన్ని అక్కడిక్కడే తొలగించి రూ.700లు జరిమానా విధించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మరికొందరు ప్రముఖుల కార్లకు సైతం బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు వారికి సైతం జరిమానా విధించారు.
 
ఇదిలా ఉంటే మార్చి 31న టోలీచౌకి వద్ద న‌టుడు మంచు మ‌నోజ్ కారును ఆపిన పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.700 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. టింటెడ్ గ్లాస్ వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. వాహనం కిటికీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. కానీ కొంతమంది సెలబ్రిటీలు తమ గోప్యత కోసం అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్నారు. అయితే ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప 2తో అల్లు అర్జున్ ప్ర‌త్యేక ఏమిటో తెలుసా!